విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ కనక దుర్గమ్మకు మరో బంగారు కిరీటం

By Santaram
|
Google Oneindia TeluguNews

Kanakadurga Temple
విజయవాడ: కనదర్గమ్మకు మరో బంగారు కిరీటం సమకూరింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యురాలు డాక్టర్‌ చదలవాడ సుధ దంపతులతో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యులు పెదర్ల రాజబాబు ఈ కిరీటాన్ని బహూకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి బంగారు కిరీటం లేదని తెలుసుకున్న వీరు నగరంలోని ముసద్దిలాల్‌ జ్యూయలరీలో దీనిని తయారు చేయించారు.

ఉత్సవమూర్తికి శోభను చేకూర్చే విధంగా కిరీటం రూపొందింది. కిరీటం, కర్ణాభరణాలకు 412 గ్రాముల బంగారం వినియోగించినట్లు తయారీదారులు తెలిపారు. అమావాస్య తర్వాత మంచిరోజున దేవస్థానం అధికారులకు దాతలు కిరీటాన్ని అందచేస్తారని అర్చకులు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X