వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మహిళా టెక్కీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman Techie found dead
న్యూఢిల్లీ: గుర్గావ్ లోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా టెక్కీ శుక్రవారం ఢిల్లీలోని ఓ ఫ్లాట్ లో శవమై కనిపించింది. మూడు రోజుల్లో పెళ్లి కావాల్సి ఉన్న సమయంలో ఆమె శరీరంపై గాయాల గుర్తులున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన మొనికా జైస్వాల్ అనే ఆ మహిళ దక్షిణ ఢిల్లీలోని మదన్గిరిలో గల తన అద్దె ఇంట్లో శుక్రవారం ఉదయం మరణించినట్లు పోలీసులు చెప్పారు.

తాము చేస్తున్న మొబైల్ కాల్స్ కు సమాధానం రాకపోవడంతో మోనికా తల్లిదండ్రులు ఢిల్లీకి వచ్చారు. ఇల్లు లాక్ చేసి ఉండడంతో తలుపులు పగులగొట్టారని, మోనికా శవం బెడ్డుపై పడి ఉందని, శరీరంపై పలు గాయాలున్నాయని, శవపరీక్షకు ఆదేశించామని అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎస్కే జైన్ చెప్పారు. పోస్టుమార్టం తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని ఆయన అన్నారు.

మోనికా గుర్గావ్ లోని ఐబియంలో పనిచేస్తోంది. గత ఏడాదిన్నరగా ఆమె మదన్గిరీలో నివాసం ఉంటోంది. రవి మిశ్రాను, ఇతర మిత్రులను పోలీసులు విచారించారు. ఈ నెల 14వ తేదీన ఆమె మిశ్రాను పెళ్లి చేసుకోవాల్సి ఉండింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X