విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్తా జిల్లాలో స్వల్ప భూకంపం: భయం గుప్పిట్లో జనం

By Santaram
|
Google Oneindia TeluguNews

Small tremors in Coastal Andhra
విజయవాడ: సునామీ హెచ్చరికలకు తోడు కోస్తాలో భూమి కంపించడంతో జనం భయభ్రాంతులవుతున్నారు. కోస్తా జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పలు చోట్ల ఇళ్లలో సామాన్లు కిందపడిపోవడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. విశాఖలో వరుసగా మూడుసార్లు ప్రకంపనలు సంభవించాయి.

చెన్నైలోనూ, తమిళనాడులోని పలుప్రాంతాల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరులో ఎత్త్తెన భవనాలు అటూఇటూ వూగడంతో ప్రజలు భయకంపితులయ్యారు. విజయవాడలోని సింగ్‌నగర్‌, మొగల్రాజపురం ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఇదిలా ఉండగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీభూకంపం సంభవించింది. కడపటి వార్తలందేసరికి నష్టం వివరాలు తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X