గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Trains robbed
గుంటూరు/నల్లగొండ: రెండు రైళ్లలో దోపిడీలు జరిగాయి. నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెసు రైళ్లలో దొంగలు ప్రవేశించి ప్రయాణికులను దోచుకున్నారు చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తోన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు జిల్లా నడికుడి వద్ద 10 బోగీల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగదు, నగలును దోచుకెళ్లారు. సుమారు 25 మంది ఇందులో పాల్గొన్నట్లు సమాచారం.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీగ్యాంగ్‌ లేదా రెడ్డిగూడెం దొంగలు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు-నడికుడి మార్గంలో గత రెండు నెలల్లో ఇది నాలుగో దోపిడి. కాగా, నారాయణాద్రి ఎక్స్ ప్రెసు రైలులోనూ దొంగలు పడ్డారు. రైలు విష్టుపురం వద్ద ఆగినప్పుడు దోపిడీ దొంగలు ఎస్2 బోగీలోకి ప్రవేశించి ముగ్గురు మహిళల వద్ద నగలును దోచుకెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X