వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డింపుల్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: సెల్వరాజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dimple|
హైదరాబాద్‌: బుల్లితెర వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. టీవీ ఆర్టిస్టు డింపుల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మరో టీవీ ఆర్టిస్టు సెల్వరాజ్ శనివారం మానవ హక్కుల కమిషన్ (హెచార్సీ)కి ఫిర్యాదు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డింపుల్ తనపై దాడులు చేయించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై దాడి సంఘటనలో తనను అప్రతిష్ట పాలు చేసిన డింపుల్ పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెప్పారు.

కాగా, శ్రీధర్ వర్మపై దాడి కేసులో, తనపై దాడి నాటకం కేసులో డింపుల్ కు శనివారం బెయిల్ మంజూరైంది. ఆమె శనివారం సాయంత్రంలోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాదులోని కూకట్ పల్లి సమీపంలో టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై డింపుల్ దాడి చేయించినట్లు కేసు నమోదైంది. అలాగే, మణికొండ వద్ద తనపై దాడి జరిగిందంటూ ఆమె డ్రామా ఆడింది. ఈ రెండు సంఘటనలను కూడా సెల్వరాజ్ పైకి నెట్టే ప్రయత్నం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X