హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అరవింద్ మెడకు భూవివాదం ఉచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ మెడకు భూవివాదం ఉచ్చు బిగిసుకుంటోంది. అల్లు అరవింద్ చట్ట విరుద్ధంగా, అక్రమంగా ఆలయ భూములను కొనుగోలు చేశారని బిజెపి, సిపిఐ నాయకులు ఆరోపించారు. ఆంధ్రజ్యోతి - ఎబిఎన్ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వారు ఈ ఆరోపణలు చేశారు. అల్లు అరవింద్ కు నీతి, ధర్మం ఉంటే అక్రమంగా కొనుగోలు చేసిన ఆలయ భూములను తిరిగి ఇచ్చేయాలని బిజెపి నాయకుడు ఎవిఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజాకోర్టు నిర్వహించి ఆ భూములను తీసుకుని ఆలయానికి అప్పగిస్తామని ఆయన అన్నారు.

ఆలయ భూములను కొనగూడదని ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తూ అల్లు అరవింద్ ఆలయ భూములను కొనుగోలు చేశారని సిపిఐ కార్యదర్సివర్గ సభ్యుడు రామకృష్ణ ఆరోపించారు. అక్రమంగా భూములు కొనుగోలు చేసిన అల్లు అరవింద్ కు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆయన విమర్శించారు. కాగా, తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నందుననే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని అల్లు అరవింద్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X