కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కనకలక్ష్మి మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Karimnagar Dist
కరీంనగర్‌: రెండు రోజుల క్రితం సిరిసిల్లలో ఉన్మాది దాడితో తీవ్రంగా గాయపడిన కనకలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తనతో పెళ్లికి అంగీకరించకపోవటంతో నరేష్‌ అనే యువకుడు కనకలక్ష్మిని చున్నితో ఉరేసి చనిపోయిందనుకుని మానేరు వాగులో పడవేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.

ఇదే జిల్లాలో మరో ప్రేమ వ్యహారం వివరాలివి. కరీంనగర్‌ మండలం బావుపేట, బద్ధిపల్లి గ్రామాలకు చెందిన దీకొండ మమత, ఉప్పు తిరుపతిల ప్రేమ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తిరుపతి గురువారం రాత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... బద్ధిపల్లిలో తిరుపతి ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న మమత కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X