హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం

By Santaram
|
Google Oneindia TeluguNews

R Krishnaiah
హైదరాబాద్: రాష్ట్ర బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన దీక్షకు మద్దతుగా రాష్ట్ర నలూమూల నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘం కార్యకర్తలు, విద్యార్ధులు తరలివచ్చారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి తన మద్దతు తెలిపారు.

విద్యానగర్ లోని బిసి సంక్షేమ భవన్ వద్ద దీక్షకు కూర్చున్న కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీరియంబర్స్‌ మెంట్, ఉపకార వేతనాల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య జీవో విడుదల చేయాలని, అంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అలాగే బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇదివరకే అనుమతి లభించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ 33 శాతం చట్టసభల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X