వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లో బస్సు - ట్రక్కు ఢీ: 17 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bihar
పాట్నా: బీహార్‌లో శనివారం ఉదయం గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతి చెందగా సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది.

పాట్నా నుంచి గయా వెళుతున్న బస్సు ధనరుయా వద్ద ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి, మరి కొంతమందిని ధనరుయా, మసౌరి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు పైకప్పు మీద కూడా ప్రయాణికులు కూర్చున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 50 వేల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X