వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్‌: ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రంలో 23 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. స్వైన్ ఫ్లూతో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల కోసం స్వైన్‌ఫ్లూ మాత్రలు వాడవద్దని, వైద్యుడి సలహా తీసుకోవాలని సూచించింది. 17 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రులు, 28 ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ చికిత్స అందిచనున్నట్లు ఆరోగ్యశాఖ తెలియజేసింది.

కేంద్రం నుంచి వచ్చిన 80వేల డోసుల స్వైన్‌ఫ్లూ మందుల్లో 60 వేలు వినియోగించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. స్వైన్‌ఫ్లూపై ఎలాంటి అనుమానాలున్నా 104 లేదా 1056 (టోల్‌ఫ్రీ) నంబర్లకు ఫోన్‌ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. హైదరాబాదులోనూ విశాఖపట్నంలోనూ ఇటీవల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X