హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బు కక్కుర్తితో హైదరాబాదులోని మహేష్ ఆస్పత్రి నిర్వాకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్ : డబ్బుల కక్కుర్తితో ఓ కార్పోరేట్ ఆస్పత్రి నిర్వాకానికి పాల్పడిన వైనం బయట పడింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాయో ఈ సంఘటన రుజువు చేస్తుంది. హైదరాబాదులోని హిమాయత్ నగర్లో గల మహేష్ కార్పొరేట్ ఆస్పత్రి రోగికి ఓ ఆపరేషన్ కోసం మరో ఆపరేషన్ చేసింది. ఆరోగ్యశ్రీ కింద వచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఆస్పత్రి ఆ నిర్వాకానికి పాల్పడింది. అలా చేసి లక్ష రూపాయలను ఆస్పత్రి డ్రా చేసుకుంది.

సత్యనారాయణ అనే వ్యక్తి హెర్నియా ఆపరేషన్ కోసం మహేష్ ఆస్పత్రిలో చేరాడు. అయితే, గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నాయంటూ వైద్యులు అతనికి జీర్ణాశయ శస్త్ర చికిత్స చేశారు. హెర్నియా ఆపరేషన్ ఆరోగ్యశ్రీ పథకం రాదు. దాంతో డబ్బులు కొట్టేయడానికి శస్త్రచికిత్సనే మార్చేశారు. ఆస్పత్రి నిర్వాకంపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X