విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగ వైష్ణవి హత్య కేసులో నా ప్రమేయం లేదు: జోగి రమేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: నాగ వైష్ణవి హత్య కేసులో తన ప్రమేయం లేదని పెడన శాసనసభ్యుడు జోగీ రమేష్ స్పష్టం చేశారు. కేసులోని నిందితుడు మోర్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన సోమవారం ఖండించారు. కేసును పక్కదోవ పట్టించడానికి మోర్ల శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. మోర్ల శ్రీనివాస్ నాటకం ఆడుతున్నాడని ఆయన అన్నారు. తాను ఎటువంటి వాడినో నియోజక వర్గం ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.

నాగ వైష్ణవిని వారే హత్య చేసినట్లు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన అన్నారు. నిందితులను పట్టుకోవడం తాను ప్రముఖ పాత్ర పోషించానని, దాని వల్ల కూడా తనపై మోర్ల శ్రీనివాస్ ఆరోణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. కేసును నీరు గార్చడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మోర్ల శ్రీనివాస్ ఆరోపణలను బిసి నేత పలగాని ప్రభాకర్ భార్య నర్మదా దేవి కూడా ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X