హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రాజు నిమ్స్ ఆరోగ్య నివేదికపై సిబిఐ అనుమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్‌ వైద్యులు కోర్టుకు సమర్పిస్తున్న నివేదికలపై సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. రామలింగరాజు ఆరోగ్యంపై ఇతర వైద్యులతో కమిటీ ఏర్పాటుచేసి రెండో అభిప్రాయం తీసుకోవాలని ప్రత్యేక కోర్టును మంగళవారం సీబీఐ కోరింది.

రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై గురువారం నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిమ్స్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. చికిత్స పొందుతుండగా రామలింగరాజు కోర్టుకు హాజరు కావడం సాధ్యమవుతుందో లేదో స్పష్టంగా తెలపాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలన్న అంశంపై వాదనలు గురువారం జరగనున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X