వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోల మెరుపు దాడి: 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి
జవాన్లు కాల్పుల విరామంలో వేరే మార్గంలో బయటపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నక్సల్స్ అన్ని వైపులా చుట్టుముట్టారు. చీకటి పడటం, పరిసరాలపై నక్సల్స్కు మెరుగైన అవగాహన ఉండటం, నక్సల్స్ బలగాలు 200 మందికి మించి ఉండటం, స్థానికులు కూడా దాడిలో పాల్గొనడంతో నక్సల్స్దే పైచేయి అయ్యింది. నక్సల్స్ వైపు నుంచి ఎంతమంది మరణించిందీ తెలియరాలేదు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్లను నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దర్ని హెలికాప్టర్ల ద్వారా జగదల్పూర్కు, ఆ తర్వాత రాయ్పూర్కు తరలించారు. కొంతమంది ఆచూకీ తెలియలేదు. దాంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ బస్తర్ నక్సల్స్ సిఆర్పీఎఫ్ రాయపూర్ maoists chhattisgarh bastar naxals crpf raipur
Story first published: Wednesday, June 30, 2010, 8:56 [IST]