హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఆర్పీఎఫ్ జవాన్ల మృతికి చిదంబరానిదే బాధ్యత: వరవరరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Varavara Rao
హైదరాబాద్‌: ఛత్తీస్ గడ్ బస్తర్ జిల్లాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడికి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానిదే బాధ్యత అని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవర రావు అన్నారు. ఛత్తీస్‌ గఢ్‌ లో 27 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతికి కేంద్ర హోంమంత్రి చిదంబరం బాధ్యత వహించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిదులతో అన్నారు.

ఇప్పటికైనా ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో పారామిలటరీ దళాలను వెనక్కు రప్పించి గ్రీన్‌హంట్‌ ఆపరేషన్ ‌ను వెంటనే ఆపేయాలని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేయాలని కోరుతూ వరవరరావు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X