వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నలుగురు నర్సింగ్‌ విద్యార్థినుల ఆత్మహత్యా యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్‌: వరంగల్ జిల్లా హన్మకొండలోని రోహిణి నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన వీరిని కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్‌ వేధింపులే దీనికి కారణమని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. నర్సింగ్ విద్యార్థినులకు గుట్టు చప్పుడు కాకుండా వైద్యం అందిస్తున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థినులు కేరళకు చెందినవారని భావిస్తున్నారు. ఈ వార్తను సేకరించడానికి వెళ్లిన టీవీ చానెల్ ప్రతినిధులపై యాజమాన్యానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X