ఆజాద్ హతం: మావోయిస్టులకు ఎదురు లేని దెబ్బ
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చర్చల పిలుపు నేపథ్యంలో అందుకు ఆజాద్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చర్చలకు అనుకూలంగా ప్రతిస్పందిస్తూ ఇటీవల ఆయన అగ్నివేశ్ ను కలిశారని అంటున్నారు. అలాగే, ఢిల్లీలోని పలువురు మేధావులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలోనే పోలీసులు నిఘా వేసి ఆజాద్ ను పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజుల క్రితమే ఆజాద్ ను పోలీసులు పట్టుకున్నట్లు మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఆజాద్ పలు కేసుల్లో నిందితుడు. శాసనసభ్యులు నర్సిరెడ్డి, బుడ్డా వెంగళ రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన కుట్రదారు ఆజాదేనని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిపై దాడికి కూడా అతనే కారణమని తెలుస్తోంది. ఆజాద్ తో పాటు మరణించిన మావోయిస్టును ఉత్తర తెలంగాణ జోనల్ కార్యదర్శి పుళ్లూరు ప్రసాద్ అలియాస్ చంద్రన్నగా అనుమానించారు. అయితే, మరో మావోయిస్టు చంద్రన్న కాదని పోలీసులు చెప్పారు. అయితే, రెండో మావోయిస్టు నేతను గుర్తించాల్సి ఉంది.