ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ నిజమైన ఎన్ కౌంటర్లోనే మరణించాడు: ఎస్పీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Adilabad Dist
ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది నిజమైన ఎన్ ‌కౌంటరేనని జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. గత రాత్రి 10 గంటలనుంచి 2.30 వరకు ఎదురుకాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 20 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. కాల్పుల్లో పోలీసులు ఎవరూ గాయపడలేదన్నారు.

ఎన్ కౌంటర్లోనే ఆజాద్ మరణించాడని ఆయన చెప్పారు. అజాద్‌పై 16 కేసులు ఉన్నాయని ఆయనపై ప్రభుత్వం 10 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించిందని చెప్పారు. అజాద్‌ భార్య సీతక్క కూడా దళ సభ్యురాలేనని చెప్పారు. మృతుల మృతదేహాలకు ఆసిఫాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X