హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గృహ నిర్బంధంలో బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్‌: బంద్‌ లో పాల్గొనకుండా భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని పోలీసులు సోమవారం గృహనిర్బంధంలో ఉంచారు. కిషన్‌రెడ్డి ఇంటి చుట్టూ దాదాపు 15మంది పోలీసులు ఉన్నారు. ఆయనను బయటకు రానీయకుండా పహారా కాస్తున్నారు. పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెసేతర పార్టీలు తలపెట్టిన బంద్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు.

ప్రతిపక్షాల నాయకులు రాష్ట్రంలోని బస్ డిపోల వద్ద ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా జురుగుతోంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల రైళ్లను ఆపడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. గుంటూరులో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. మెదక్ జిల్లాలో పలు బస్సుల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X