హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవియంల వాడకాన్ని అడ్డుకోవడానికి కెసిఆర్ వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఇవియంల) వాడకాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆయన సోమవారం పార్టీ సీనయర్ నాయకులతో సమావేశమయ్యారు. ఇవియంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తెరాస నాయకులు ఇటీవల ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. అయితే, తాము ఇవియంలను వాడుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికార ఐవి సుబ్బారావు చెప్పారు.

ఇవియంల వాడకం తప్పనిసరి అని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో వాటి వాడకాన్ని అడ్డుకునేందుకు కెసిఆర్ వ్యూహ రచన చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 70కి పైగా నామినేషన్లు వేయించాలని, దీని వల్ల ఇవియంలు వాడడం సాధ్యం కాదని, దాంతో తప్పనిసరిగా బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని కెసిఆర్ అంటున్నారు. అలా నామినేషన్లు వేయించడానికి తెరాస కార్యక్రమాన్ని రూపొందించుకుంది. నామినేషన్లు వేసేవారికి డిపాజిట్లు పార్టీ సమకూర్చనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X