వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై వీరప్ప మొయిలీ స్పందిస్తారు: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టాలనే నిర్ణయాన్ని, ఆయన రాసిన బహిరంగ లేఖపై కాంగ్రెసు అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. మనీష్ తివారీ మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. ఎవరు కూడా పార్టీకి, పార్టీ అధిష్టానానికి అతీతులు కారని మనీష్ తివారీ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ పై పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ స్పందిస్తారని, తాను ఎక్కువగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.

ఎవరైనా పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ వ్యవహారంపై ఎవరూ మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X