హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినవాళ్లం: రామచంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి అండగా నిలిచారు. తాము దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినవాళ్లమని, నియోజకవర్గంలో జరిగే వైయస్ జయంతి సభల్లో పాల్గొనకపోతే ప్రజలు తమను కూడా ఆయన వద్దకే పంపుతారని రామచంద్రారెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ కన్నా తమకు తమకు ప్రజల మధ్య జరిగే వైయస్ జయంతి సభనే ముఖ్యమని ఆయన అన్నారు.

తాను వైయస్ జగన్ వెంటే ఉంటానని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం లేదని ఆయన అన్నారు. జగన్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారనేది పార్టీ సీనియర్ల ప్రచారమేనని ఆయన అన్నారు. మరో శాసనసభ్యుడు నర్సారెడ్డి మాత్రం జగన్ యాత్ర పట్ల విముఖత ప్రదర్శించారు. పార్టీలో ఉన్నం కాలం తాము జగన్ వెంటే ఉంటామని, జగన్ పార్టీని వీడినా తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X