హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో చంద్రబాబు, రోశయ్య మధ్య వాగ్వివాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శాసనసభలో బుధవారం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి, ముఖ్యమంత్రి రోశయ్యకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ట్రిపుల్ ఐటిల్లో సీట్ల కోతపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా రోశయ్యకు, చంద్రబాబుకు మధ్య వివాదం చెలరేగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిపై చేసిన తీవ్రమైన వ్యాఖ్య ఒకానొక సందర్భంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యపై ముఖ్యమంత్రి, కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ వ్యాఖ్యను చంద్రబాబు ఉపసంహరించుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కోతలు కోస్తే, రోశయ్య కోతలు పెడుతున్నారని, సంక్షేమ పథకాలకు రోశయ్య కోత పెడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ట్రిపుల్ ఐటిల్లో సీట్లను తగ్గించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.

మౌలిక సదుపాయాలు సరిగా లేనందున ట్రిపుల్ ఐటిల్లో సీట్లు తగ్గించామని సాంకేతిక విద్యామంత్రి మోపిదేవి వెంకటరమణ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బిజెపి, సిపిఐ, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వాకౌట్ చేసిన తర్వాత కూడా ట్రిపుల్ ఐటిల్లో సీట్ల కోతపై చర్చ జరిగింది. ట్రిపుల్ ఐటిల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని చంద్రబాబు విమర్శించారు. ట్రిపుల్ ఐటిల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తాము ఎన్నికల కోసం వాగ్గానాలు చేయలేదని, చిత్తశుద్ధితో అమలు చేయడానికి పూనుకున్నామని ఆయన చెప్పారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం తీరుకు తమ పార్టీ నిరనస వ్యక్తం చేస్తోందని చంద్రబాబు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X