శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒంటరి వాడిని కాదు, అందరి వాడిని: వైయస్ జగన్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఇచ్చాపురం: నాన్న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోతూ తనకు అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని, తాను ఒంటరి వాడిని కాదని కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ అన్నారు. గురువారం ఆయన ఇచ్చాపురంలోని ప్రజాప్రస్థాన విజయవాటిక వద్ద వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అతిపెద్ద కుటుంబాన్ని తండ్రి తనకు ఇచ్చి వెళ్లారన్నారు. మీ అందరి ఆప్యాయత, ఆదరణలో నాన్న కనిపిస్తున్నారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్‌ అన్నారు. అనంతరం ఆయన లొద్దపుట్టి బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X