వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చాపురంలో తండ్రి వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఇచ్చాపురం: కడప ఎంపీ వైయస్ జగన్‌ గురువారం ఉదయం ఇచ్చాపురం బస్టాండ్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు.

యువనేతకు జనం జేజేలు పలుకున్నారు. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మహిళలు తరలి వచ్చారు. రోడ్డు కిరువైపుల ఉన్నవారికి జగన్‌ చేతులెత్తి అభివాదం చేశారు. అనంతరం ఆయన విజయవాటిక వద్ద కేక్‌ కట్‌ చేశారు. అధిష్టానవర్గం అనుమతి ఇవ్వకపోయినా జగన్ తన తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఈ యాత్ర చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X