హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, రోశయ్యల మధ్య శతృత్వం లేదు: మంత్రి దానం

By Santaram
|
Google Oneindia TeluguNews

Danam Nagendar
హైదరాబాద్‌: రోశయ్య, జగన్ మధ్య శత్రుత్వం ఏమీ లేదని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, వైయస్ జగన్‌ ల మధ్య అంతరాన్ని పెంచే కుట్ర జరుగుతోందని నాగేందర్‌ అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మట్లాడుతూ వారి మధ్య అంతరాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుందే కానీ, ఆ అంతరాన్ని పూడ్చే ప్రయత్నం జరగటం లేదన్నారు.

ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా కొందరు మాట్లాడటాన్ని మంత్రులు ఖండిస్తున్నామన్నారు. వైయస్పై కొందరికే అభిమానం ఉన్నట్లు మీడియా ముందు మాట్లాడటం సరికాదన్నారు. తమ అందరి గుండెల్లోనూ వైయస్ అంటే అభిమానం ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెడతారనేది ఊహాగానాలేనని దానం కొట్టిపారేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X