వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఆర్జేడీ, ఎల్జేపీ బంద్ విజయవంతంమయ్యే అవకాశం

By Santaram
|
Google Oneindia TeluguNews

Bihar bandh
పాట్నా: పెట్రో ధరలు పెంపుకు నిరసనగా ఆర్జేడీ, ఎల్జేపీ పార్టీలు సంయుక్తంగా పిలుపిచ్చిన నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో శనివారం బంద్ జరుగుతోంది. ఇరు పార్టీలకు చెందిన వెయ్యి మంది కార్యకర్తలు రైల్వే ట్రాక్స్, జాతీయ రహదారులు, రాష్ట్రంలో ప్రధాన రహదారులపై భైఠాయించి రైళ్లు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్ర మంత్రి జయప్రకాష్ నారాయణ్ యాదవ్, రాజ్యసభ మెంబర్ రామ్ క్రిపాల్ యాదవ్ బీహార్‌లోని వీధి వీథుల్లోకి తిరుగుతూ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్చంధంగా మూసివేశారు.

ప్రభుత్వకార్యాలయాలు పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బస్సులు, రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఆ రాష్ట్రం బంద్ జరగడం ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం ఎన్డీయే, వామపక్షాలు బంద్‌కు పిలిపిచ్చిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X