వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనకు 50 వేల కోట్ల రూపాయల విలువైన జలాంతర్గాములు

By Santaram
|
Google Oneindia TeluguNews

AK Anthony
న్యూఢిల్లీ : మనదేశ రక్షణలో భాగంగా రూ.50వేల కోట్లవిలువైన ఆరు జలంతర్గాములు చేరనున్నాయి. సుమారు రూ.50వేల కోట్ల ఈ ప్రాజెక్టుకు రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌(డీఏసీ) ఆమోదం తెలిపింది. దీంతోపాటు రూ.42 వేల కోట్లు విలువచేసే 126 ఫైటర్‌ విమానాల కొనుగోలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబయిలోని మజగావ్‌ డాక్స్‌లో మూడు విశాఖలోని హిందుస్థాన్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో ఒక జలంతర్గామి నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిసింది.

రెండింటిని దిగుమతి చేసుకోనున్నారు. భారత్‌కు ఇప్పటివరకు అణు జలంతర్గాములులేవు. దేశీయంగా తయారుచేసిన అరిహంత్‌ 2012లో నౌకాదళంలో చేరనుంది రష్యానుంచి లీజుకు తీసుకున్న ఆకుల శ్రేణి జలంతర్గాములు అక్టోబరులో అందనున్నాయి. వీటి లీజు కాలపరిమితి పదిసంవత్సరాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X