వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ వ్యాఖ్యలపై తులసిరెడ్డి అభ్యంతరం

By Santaram
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వైయస్ రాజశేఖరెడ్డికి అత్యంత సన్నిహితుడైన తులసిరెడ్డి జగన్ పై మాటల దాడి చేశారు. ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు నరకయాతన అనుభవిస్తున్నారన్న జగన్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అభ్యంతరం తెలిపారు. నిజంగా శాసనసభ్యులు నరకయాతన పడితే... స్వయంగా వారే చెప్పాలని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర వద్దని అధిష్ఠానం చెప్పలేదని ఆయన తెలిపారు.

యాత్రలో పాల్గొనవద్దని ఎవ్వరినీ పార్టీ ఆదేశించలేదని తులసి రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం తులసిరెడ్డి, ముఖ్యమంత్రి రోశయ్యని ఆయన నివాసంలో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మంత్రులు ధర్మాన, గాదె వెంకటరెడ్డి, వట్టి వసంతకుమార్‌లు సైతం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X