హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వ్యవహారంపై మొయిలీ మాట్లాడ్తారు: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై సరైన సమయంలో స్పందిస్తారని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలన్నీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చూసుకుంటారని, మొయిలీ ఢిల్లీలోనే ఉన్నారని ఆయన అన్నారు. జగన్ వ్యవహారంపై మాట్లాడడానికి తాను తగిన వ్యక్తిని కానని ఆయన అన్నారు. జగన్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం క్షుణ్నంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు.

కాగా, జగన్ వ్యవహారంపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో జగన్ వ్యవహారంపై చర్చించారు. లండన్ నుంచి వచ్చిన వెంటనే వీరప్ప మొయిలీ సోమవారం ఉదయం నుంచి కోర్ కమిటీకి చెందిన నాయకులతో తర్జన భర్జనలు పడుతున్నారు. జగన్ పై ఏ విధమైన చర్య తీసుకోవాలనే విషయంపై పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చలు జరుపుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X