వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో క్లోరిన్ గ్యాస్ లీక్ : ముగ్గురు మృతి, పలువురికి అస్వస్థత

By Pratap
|
Google Oneindia TeluguNews

Maharashtra
ముంబై: ముంబైలోని సెవ్రీ ప్రాంతంలో క్లోరిన్ గ్యాస్ లీకై ముగ్గురు మరణించగా, 60 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద సంఘటన బుధవారం తెల్లవారుజామును జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల వద్ద తెల్లవారు జామున 4 గంటలకు ఈ సంఘటన జరిగిందని అధికారులు చెప్పారు. కళ్లు మండుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తుండడంతో గ్యాస్ లీకైన విషయాన్ని పసిగట్టారు.

విషయం తెలిసిన వెంటనే లీకేజీని అదుపు చేయడానికి తమ సిబ్బంది వెళ్లారని, వారిలో నలుగురు అస్వస్థతకు గురయ్యారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఉదయ్ తత్కారే చెప్పారు. దాదాపు 59 మందిని సమీపంలోని జెజె ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించారు. ముంబై పోర్టు ట్రస్టు ఆవరణలోని స్క్రాప్ యార్డులో ఈ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X