హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీ, ఆల్మట్టిలపై అసెంబ్లీ ఆవరణలో టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: మహారాష్ట్ర అక్రమకట్టడాలు, ఆల్మట్టి అంశాలపై సభలో చర్చించనందుకు నిరసనగా తెలుగుదేశం శాసనసభ్యులు బుధవారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం సభలో ఈ అంశాలను చర్చకు రానీయకుండా చేస్తోందని వారు అన్నారు. అక్రమ కట్టడాలు ఆపేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిజనిర్థారణ కోసం టీడీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. దీనికి ముఖ్యమంత్రి, స్పీకర్‌తో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. గతంలో మహారాష్ట్ర బెదిరింపులకు భయపడి పొన్నాల ప్రాజెక్టులను చూడకుండా వెనక్కు తిరిగి వచ్చారని చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానన్నారు. వచ్చే నెలలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయపక్షాలతో కలిసి మద్యంపై ఉద్యమాలు చేస్తామన్నారు. టీటీడీ అక్రమా పుట్టగా మారిందని టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X