వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెయిల్ వద్దు, తిరిగి వెళ్లేది లేదు: మెజిస్ట్రేట్ తో చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu
ధర్మాబాద్: తాను బెయిల్ తీసుకోబోనని, బాబ్లీ ప్రాజెక్టును చూసే వరకు తిరిగి వెళ్లేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెజిస్టేట్ తో చెప్పారు. బెయిల్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వెళ్లాలని ధర్మాబాద్ మెజిస్ట్రేట్ చేసిన సూచనను ఆయన శనివారం నిరాకరించారు. చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులు బెయిల్ తీసుకుని తిరిగి వెళ్లిపోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. చంద్రబాబు సహా 76 మంది తెలుగుదేశం నాయకులను పోలీసులు శుక్రవారం సాయంత్ర అరెస్టు చేసి ఐటిఐ కళాశాలకు తరలించారు.

రాత్రంతా తెలుగుదేశం నాయకులు ఐటిఐ కళాశాలలోనే ఉన్నారు. శనివారం ఉదయం కళాశాల ఆవరణ నుంచి బయటకు రావడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కింద పడిపోయారు. మీడియా వద్దకు రాకుండా తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X