తెలంగాణ బీడవుతుందని సోనియాకు తెలియదా: నాగం
మహారాష్ట్రలో ముంపు ప్రాంతానికి మనం డబ్బు కట్టామని నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. ఓ ప్రాజెక్టు పరిధిలో మరో ప్రాజెక్టు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉన్న 13 ప్రాజెక్టులను తమ పార్టీ బృందానికి చూపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులున్నాయో చూపమని సవాల్ విసిరారు. తమ పార్టీ నేతల పట్ల చవాన్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నేతలకు సౌకర్యాలు కల్పించాలని ఆయనను కోరతామని తెలిపారు. చంద్రబాబు, ప్రజాప్రతినిధుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుల అరెస్టు, పరిణామాలపై తెలుగుదేశం సీనియర్ నాయకులు హైదరాబాదులో సమీక్షించారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్ర హైదరాబాద్ nagam janardhan reddy chandrababu babli dharmababad hyderabad
Story first published: Saturday, July 17, 2010, 16:18 [IST]