వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన మహా పోలీసు వ్యూహం: ఎపికి చంద్రబాబు తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ధర్మాబాద్: నారా చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం నాయకుల విషయంలో మహారాష్ట్ర పోలీసుల వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రి వారిని ఔరంగాబాద్ జైలుకు తరలించాలని ప్రయత్నించారు. వాహనాలు సరిగా లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నాయకులను వాహనాల్లో ఎక్కించి ఆంధ్రప్రదేశ్ లో వదిలిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం నాయకుల కాళ్లూ చేతులూ పట్టుకుని వాహనాల్లోకి తోస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం నాయకులను ఉంచిన ధర్మాబాద్ లోని ఐటిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులపై పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. ఈ లాఠీచార్జీలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి ఓ టీవీ చానెల్ తో చెప్పారు. అక్కడి పరిస్థితులు వివరిస్తూ కొత్తకోట దయాకర్ రెడ్డి విలపించారు. తెలుగుదేశం నాయకుల వ్యక్తిగత సిబ్బందిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోకి తరలించారు. తెలుగుదేశం నాయకులను బృందాలుగా విడదీసి వాహనాల్లో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని కొత్తకోట దయాకర్ రెడ్డి చెప్పారు. తమ నేత చంద్రబాబును పోలీసులు తోసేశారని, పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X