హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిస్థితిపై సిఎం రోశయ్య ఆరా: వీధుల్లోకి టిడిపి శ్రేణులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం నాయకుల అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. రోశయ్య పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి రోశయ్యతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. చంద్రబాబు కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చంద్రబాబు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

కాగా, మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు సహా తెలుగుదేశం ప్రతినిధుల పట్ల వ్యవహరించిన తీరుపై రాష్ట్రంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం శ్రేణులు వీధుల్లోకి వస్తున్నాయి. విశాఖపట్నంలో తెలుగుదేశం కార్యకర్తలు నాలుగు బస్సుల అద్దాలు పగులగొట్టారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మహారాష్ట్ర వాహనాలపై దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాస్తోరోకో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రాస్తోరోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X