హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాలుర మన భూభాగంలోనే ఉంది: పొన్నాల లక్ష్మయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్‌: నిజామాబాద్‌ బోధన్‌ సమీపంలో నిర్మించిన సాలూర ప్రాజెక్టు పూర్తిగా మన రాష్ట్ర భూభాగంలోనే నిర్మాణమైనట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. సాలూర మహారాష్ట్ర భూభాగంలో ఉందంటూ శివసేన యాత్ర చేపట్టిన నేపథ్యంలో పొన్నాల ఆ విషయం స్పష్టం చేశారు. నాందేడ్‌, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్లు, సర్వే ఆఫ్‌ ఇండియా అధికారుల నిర్ధారణ అనంతరమే ప్రాజెక్టును నిర్మించినట్టు ఆయన వెల్లడించారు. సాలూరకు శివసేన పాదయాత్ర చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో ఆయన నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలు లేకుండా పరిస్థితులు చక్కబెట్టాలని వారికి పొన్నాల సూచించారు.

సాలూర పథకంపై సర్వేచేసి నిజానిజాలు తెలుసుకోవచ్చని తెలుగుదేశం నేత మండవ వెంకటేశ్వరరావు అన్నారు. శివసేన, మహారాష్ట్ర సర్కారు కావాలనే సాలూర పథకంపై రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన వారు ఎవరొచ్చినా స్వాగతం పలికి నిజానిజాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X