వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్లీపై చేతులెత్తేసిన కేంద్రం: సుప్రీం తేల్చాలన్న బన్సల్

By Pratap
|
Google Oneindia TeluguNews

PK Bansal
న్యూఢిల్లీ: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. బాబ్లీ సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించాల్సిందేనని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పికె బన్సాల్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాల్లో కేంద్ర ప్రభుత్వం చేసేది చాలా తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. బాబ్లీ వివాదంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అవసరం లేదని ఆయన అన్నారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. నియమ నిబంధనల ప్రకారమే బాబ్లీని నిర్మిస్తున్నట్లు అశోక్ చవాన్ చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీల ప్రతినిధులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిసి బాబ్లీ సమస్య పరిష్కారం కోసం విజ్ఞప్తి చేయనున్న నేపథ్యంలో బన్సల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X