కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికల్లో జై ఆంధ్ర నేతల ప్రచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
కరీంనగర్: తెలంగాణ ఉప ఎన్నికల్లో జై ఆంధ్ర నేతలు ప్రచారానికి దిగారు. తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్థులనే గెలిపించాలని వారు ఓటర్లను కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో కలిసి వారు రోడ్ షోలో పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రంలోనే తాము అభివృద్ధి చెందుతామని వారు చెబుతున్నారు. సమైక్యవాదం పారిశ్రామికవేత్తల కుట్ర అని వారు విమర్శిస్తున్నారు.

సమైక్య రాష్ట్రంలో సకల దరిద్రాలున్నాయని వారు అంటున్నారు. సంపన్నులు మరింత సంపన్నులు కావడానికే సమైక్యవాదాన్ని ముందుకు తెచ్చారని వారు విమర్శిస్తున్నారు. స్వార్థ రాజకీయాల వల్ల విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. హైదరాబాదులో వారు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తున్నారని, తమ ఆంధ్ర ప్రాంతాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు. 12 స్థానాల్లోనూ తెలంగాణవాదులు గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X