హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయ్యారం గనుల లీజు రద్దు: వైయస్ జగన్ కు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan|
హైదరాబాద్: ఓదార్పు యాత్ర ద్వారా ధిక్కార స్వరం వినిపిస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన బయ్యారం గనుల లీజును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బయ్యారం గనుల లీజుపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతోపాటు అన్ని విపక్షాలు శాసనసభలో దుమారం రేపాయి. కాంగ్రెస్‌ పార్టీలో కూడా జగన్ ‌వర్గం మినహా మిగిలిన వారంతా విచారణకు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కా గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన ఫైళ్ళను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టి మరీ నిర్ణయం తీసుకున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్ కు అత్యంత సమీప బంధువు కావడం విశేషం.

ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన సూచనను మంత్రులు వ్యతిరేకించారు. మంత్రి వట్టి వసంత కుమార్‌ దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించినందున విచారణ అనవసరమని చేసిన సూచనకు ఇతర మంత్రులెవరూ స్పందించలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 1.40 లక్షల ఎకరాల్లో గనుల అక్రమాలు జరుగుతుండడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని తెలంగాణ నేతలు వాదించారు. కొందరు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ వాదన వినిపించారు. పెద్దమొత్తంలో ఇనుప ఖనిజాన్ని ఒక ప్రయివేటు కంపెనీకి కారుచౌకగా ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసి ద్వారానే కట్టబెట్టే ఒప్పందంపై నేతలు మండిపడ్డారు. ఇదేసమయంలో కొందరు ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X