గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి హత్య: వారం తర్వాత వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వారం రోజుల క్రితం జరిగిన నాగవర్ధన్ రెడ్డి అనే ఇంజనీరింగ్ విద్యార్థి హత్యా సంఘటన సోమవారం వెలుగు చూసింది. నిందితుడు శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సారావుపేట సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీనివాస్ డబ్బుల కోసం హత్య చేసి శవాన్ని పొన్నూరు సమీపంలోని పంటపొలాల్లో పడేసినట్లు పోలీసులు చెప్పారు.

నాగవర్ధన్ రెడ్డి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం తౌపాడు గ్రామానికి చెందినవాడు. శ్రీనివాస్ కూడా అదే గ్రామానికి చెందినవాడు. నాగవర్ధన్ రెడ్డికి చెందిన బైక్ ను అమ్ముతుండగా పోలీసులు శ్రీనివాస్ ను పట్టుకుని కూపీ లాగారు. దాంతో శ్రీనివాస్ తన తప్పును అంగీకరించాడు. తాను నాగవర్ధన్ రెడ్డి శవాన్ని పడేసిన చోటును చూపించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X