వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్ బాంబు దాడుల్లో 40 మంది మృతి, 68 మందికి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Iraq
బాగ్దాద్‌: ఇరాక్‌లోని కర్బాల పట్టణంలో జరిగిన రెండు కారు బాంబు దాడుల్లో 40 మంది పౌరులు మృతి చెందారు. దాదాపు 68 మంది గాయపడ్డారు. షియాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. మతపరమైన ఉత్సవాల కోసం పెద్దయెత్తున షియాలు గుమిగూడారు. ఆ షియా యాత్రికులపై దాడులు జరిగాయి. మార్చిలో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఇరాక్ ‌లో ప్రభుత్వం ఏర్పడకపోవడం ఇటువంటి ఘటనలకు కారణమవుతోందని భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో వందల మంది మరణించారు.

తొలి బాంబు పేలుడులో 18 మరణించారు. ఆ పేలుడు సంభవించిన కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతానికి కేవలం 300 అడుగుల దూరంలో మరో పేలుడు సంభవించిది. ఈ సంఘటనలో 22 మంది మృతి చెందారు. అంతకు ముందు సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X