వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా సర్వే నిజమైనందుకు బాధగా ఉంది: లగడపాటి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ : తెలంగాణ ఉప ఎన్నికలపై తన సర్వే నిజమైనందుకు బాధగా ఉందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. కాంగ్రెసు గెలుపొందాలని తాను కోరుకున్నానని, అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను సర్వే చేయించిన 11 స్థానాల్లో రాజీనామా చేసిన అభ్యర్థులు గెలుస్తారని సర్వేలో తేలిందని, అదే విషయాన్ని తాను వెల్లడించానని ఆయన చెప్పారు. సిద్ధిపేటలో మాత్రం తాను సర్వే చేయించలేదని ఆయన అన్నారు. తాను సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఉండాల్సిందేమోనని అనిపిస్తోందని, తన వెల్లడి వల్ల కాంగ్రెసు కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తింటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలం కోల్పోయిందని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాస్తా లబ్ధి పొందారని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్ల అనుబంధం పెరిగిందని ఆయన అన్నారు. బాబ్లీ పోరాటం వల్లనే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. చంద్రబాబు ఎత్తుగడ ఫలించిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు బలాబలాలకు నిదర్శనం కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X