హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనాల పండుగను రాష్ట్ర పండగా ప్రకటించాలి: గీతారెడ్డి

By Santaram
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: బోనాల పండగను రాష్ట్ర పండగగా చేయాలనే డిమాండ్‌ ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని మంత్రి గీతారెడ్డి మీడియాకు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండగను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటారన్నారు. బోనాల పండగ ప్రాంతాలకతీతంగా వుండాలని ఆమె అన్నారు.

ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితోపాటు దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి, మేయర్‌ కార్తీకారెడ్డిలు ఉన్నారు. ఎంతో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రోశయ్యకు ఈ ఉత్సవాలు మంచి ఓదార్పును ఇచ్చి ఉంటాయి. త్వరలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఆయనకు అనుకూలురైన ఎమ్మెల్యేలు ఆయనకు బాసటగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X