హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో వైయస్ జగన్ ప్రచారంపై డిఎస్ నో కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేసి ఉంటే కాంగ్రెసు మంచి ఫలితాలు సాధించి ఉండేదనే అభిప్రాయంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ఆ విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ముక్కు మీద వేలేసుకుని ఏమీ మాట్లాడబోననే సంకేతాన్ని అందించారు. ఉప ఎన్నికల ఫలితాలపై పిసిసి సోమవారం సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాజీనామా చేసినవారినే తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ఆయన అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తామని, ఫలితాలపై సోనియాకు లేఖ రాస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X