టిటిడి ఆర్జిత సేవ అక్రమాలపై సర్కార్ ఉక్కిరి బిక్కిరి
తిరుమల, బెంగళూర్, చెన్నై కేంద్రాలుగా ఆర్జిత సేవా టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు ముగ్గురు బోర్డు సభ్యుల వ్యక్తిగత సహాయకులను విచారించినట్లు తెలుస్తోంది. అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో పరువు కోసం టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు రంగంలోకి దిగారు. రాయల కాలంనాటి ఆభరణాలను పురావస్తు శాఖ ద్వారా పరీక్షలు చేయించి ధృవీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, August 2, 2010, 14:16 [IST]