హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మన తెలుగుతల్లి పుస్తకావిష్కరణపై తెలంగాణ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: హైదరాబాదులోని సోమాజిగుడా ప్రెస్ క్లబ్బులో మన తెలుగుతల్లి పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు సోమవారం అడ్డుకున్నారు. ఎపిఎన్నారైల పేరుతో ఏర్పాటైన ఈ పుస్తకావిష్కరణ సభలోకి తెలంగాణవాదులు దూసుకొచ్చి సభను అడ్డుకున్నారు. పుస్తకాన్ని వేదికపైకి విసరేశారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంక్షోభ సమయంలో ఈ విధమైన కార్యక్రమాలు చేయడం సరి కాదని తెలంగాణవాదులు అంటున్నారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేయడానికి అనువైన మాటలు పుస్తకంపై ఉన్నాయని వారు విమర్శించారు.

పుస్తకావిష్కరణను అడ్డుకునే సమయంలో తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్, తదితరులు వచ్చారు. తెలంగాణవాదుల గొడవతో పుస్తకావిష్కరణ ఆగిపోయింది. వక్తలు ఒక్కరొక్కరే అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అయితే మరింత మంది తెలంగాణవాదులు వేదిక వద్ద అలాగే ఉండిపోయారు. పుస్తకావిష్కరణ సభకు పట్టుమని పది మంది కూడా రాలేదు. కానీ పోలీసులు మాత్రం వంద మందికి పైగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X