ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెచ్చిపోయిన మావోలు: 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల గల్లంతు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
ఖమ్మం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా గునిపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సిఆర్పిఎఫ్ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల సంఘటనలో 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియడం లేదు. నలుగురు పోలీసులు ఈ ఘటనలో మరణించినట్లు సమాచారం.

బుధవారం ఉదయం గాలింపు చర్యలు జరుపుతుండగా సిఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వంద మంది జవాన్లు గాలింపు చర్యలకు వెళ్లారు. అయితే వారిలో 25 మంది వెనక్కి తిరిగి వచ్చారు. మిగతా 75 మంది ఆచూకీ తెలియడం లేదు. వారు మావోల చేతిలో మరణించి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే వాతావరణం సహకరించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X