హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటాం: దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పారు. సంప్రదింపుల కోసం గురువారం హైదరాబాద్ వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సంప్రదింపుల ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ లను చర్చలకు ఆహ్వానించబోమని ఆయన చెప్పారు. ఎవరైనా తమ ముందు వాదనలు వినిపించవచ్చునని ఆయన అన్నారు.

సంప్రదింపుల ప్రక్రియ 99 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ లో షాద్ నగర్ నుంచి కడప వరకు రైలు ప్రయాణం చేస్తామని ఆయన అన్నారు. రాష్ట పరిస్థితులను అధ్యయనం చేయడానికి అవసమైతే పాదయాత్ర చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున పార్లమెంటు సభ్యులకు మరో అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X