తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు తిరుమలలో బోనులో చిక్కిన చిరుతపులి

By Pratap
|
Google Oneindia TeluguNews

Cheetah
తిరుపతి: తిరుమల కాలినడకబాటలో భక్తులపై దాడి చేసి భయభ్రాంతుల్ని చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కాలినడకబాటలో ఏడో మైలు వద్ద చిరుతపులి బోనులో చిక్కింది. వారం రోజుల ప్రయత్నాల తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకోగలిగారు. అయితే కాలిబాటలో తిరుగుతున్నవి జంట చిరుతలని పాదముద్రల ఆధారంగా అటవీ అధికారులు నిర్ధరించారు. మరో పులి కోసం వేటను ముమ్మరం చేశారు. బోనులో చిక్కిన చిరుతను జంతు ప్రదర్సనశాలకు తరలించారు. యాత్రికులు భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల చిరుత ఓ బాలికపై దాడి చేసింది. ఆ దాడిలో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి కాలినడక బాటలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X